telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తిరుపతి లో హిందువులు ఓటు బ్యాంకు గా మారాలి : బండి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… కేసీఆర్ ని హైద్రాబాద్ లో అడుగు పెట్టనియ్యం అన్న వాళ్ళు మంత్రులు అయ్యారు. తెలంగాణ ఉద్యమ కారులు తెరమరుగు అయ్యారు.. కేసీఆర్ లెక్క ద్రోహం చేసే పార్టీ బీజేపీ కాదు. సోము వీర్రాజు గారి నేతృత్వంలో ఉద్యమాలు చేస్తున్నారు. హిందు ధర్మం పై అధికార పార్టీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. దేవుళ్ళ విగ్రహాలను దుర్మార్గం గా ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ అధికార పార్టీ ఒక మతానినికి వత్తాసు పలుకుతుంటే.. అక్కడ ఒక మతమే రాజ్యం ఎలుతోంది. ఏపీలో దమ్మున్న కార్యకర్తలు ఉన్నారు.. వారి సహనాన్ని పిరికి తనంగా బావించవద్దు.. మా కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తే వైఎస్సార్ పార్టీ మూట ముల్లె సర్దుకోవాల్సి ఉంటుంది . ఒక మతానికి వత్తాసు పలికితే ఇక్కడ హిందువులు ఓటు బ్యాంకు గా మారి దుబ్బాక, జీహెచ్‌ఎంసీలలో బుద్ది చెప్పారు.  అలాగే తిరుపతి లో హిందువులు కూడా ఓటు బ్యాంకు గా మారాలి. ఏడుకొండల వాడిని రెండు కొండలు చేసే పార్టీ కావాలి .. ఏడుకొండల వాడ వెంకటరమణ అనే పార్టీ కావాలా… బైబిల్ చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ కావాలా.. భగవద్గిత చేత పట్టుకొని వచ్చే పార్టీ కావాలా ఆలోచించాలి. తిరుపతి పలితాలు కోసం దేశం, ప్రపంచం ఎదురుచూస్తుంది అని అన్నారు. చూడాలి మరి అక్కడ ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts