telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

యాదాద్రి రింగ్‌రోడ్డు పనులను పరిశీలించిన కేసీఆర్

bonalu kcr hyderabad

తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి శ్రీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదాద్రి ప్రధాన ఆలయాన్ని కేసీఆర్‌ పరిశీలించారు.

యాదాద్రి గుట్ట చుట్టూ రూ.143 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రింగ్‌రోడ్డును పరిశీలించారు. రాయగిరి, యాదగిరిగుట్ట మధ్యలో నరసింహ అరణ్యం… మినీ ట్యాంక్‌బండ్‌ పనులను కూడా పరిశీలించారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts