telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ ప్రభుత్వం వల్ల మూడు నెలల్లోనే రాష్ట్రం దివాళా: ఎంపీ రామ్మోహన్ నాయుడు

Rammoan naidu

వైసీపీ ప్రభుత్వం మాత్రం మూడు నెలల్లోనే  రాష్ట్రాన్ని దివాళా తీయించిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన జాయింట్ కలెక్టర్‌కు జిల్లా సమస్యలను వివరించారు. అనంతరం రామ్మోహన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అవగాహనారాహిత్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

రైతులకు సకాలంలో నీరు అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రైతుల సమస్యలపై సమీక్ష చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎం జగన్‌కు కక్ష సాధింపు తప్ప.. ప్రజల సంక్షేమమే పట్టడంలేదన్నారు. అవగాహన లేని వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుందో మూడు నెలలకే అర్థం అయిపోయిందని పేర్కొన్నారు.

Related posts