ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ యువనేత నారా లోకేశ్ పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. లోకేశ్ మాట్లాడితే తప్పులు దొర్లుతాయనే ఎక్కువగా ట్వీట్లు చేస్తుంటారని ఎద్దేవా చేశారు. అసలు, లోకేశ్ తరఫున ట్విట్టర్ లో కామెంట్లు రాసేది ఎవరో అర్థంకావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇక చంద్రబాబుపైనా అనిల్ కుమార్ యాదవ్ వ్యంగ్యం ప్రదర్శించారు. టీడీపీ నేతలు తమ నాయకుడ్ని వెతికే పనిలో ఉన్నారంటూ దుయ్యబట్టారు. వివాదాలు వీడిపోవాలనే సీఎం జగన్ గోదావరి జలాల తరలింపుపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పోలవరం పనులేమీ ఆగలేదని అనిల్ కుమార్ పేర్కొన్నారు.
పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారు: చినరాజప్ప