telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మంగళగిరిలో మహానాడు..టీడీపీ ఆఫీస్ కు కరోనా నోటీసు!

TDP-flag

గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అధికారులు కరోనా నోటీసు జారీ చేసారు. రెవెన్యూ అధికారులు ఈ నోటీసులను అందించారు. మహానాడు జరుగుతున్నందున కార్యాలయలో కరోనా నివారణ చర్యలను తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. మంగళగిరి తహశీల్దార్ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి.

టీడీపీ కార్యాలయ సెక్రటరీ రమణకు ఆత్మకూరు వీఆర్వో నోటీసులు అందించారు. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈసారి మహానాడును ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. టీడీపీ శ్రేణులంతా ఈ కార్యక్రమాన్ని ఆన్ లైన్ ద్వారా వీక్షిస్తున్నారు.

Related posts