telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇల్లు కూల్చివేత

peelagovind tdp

రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలపై దృష్టిసారించిన ఏపీ సర్కార్ ఇప్పటికే ఎన్నో భవనాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఇంటిని జీవీఎం అధికారులు కూల్చివేశారు. విశాఖ నగరంలో ద్వారకానగర్ మొయిన్ రోడ్డులో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కి చెందిన బహుళ అంతస్థుల భవనం నిర్మించుకున్నారు. అయితే సరైన అనుమతులు లేకుండా డ్రైన్ ఆక్రమించి భవనం నిర్మించారని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు శనివారం ఉదయమే ఈ కూల్చివేత కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కూల్చివేతతో ద్వారకానగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ద్వారకానగర్‌లో భారీగా పోలీసుల మోహరించారు.

Related posts