telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ బీజేపీ నూతన కమిటీ ఎంపిక

bjp party

తెలంగాణ బీజేపీ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. 23 మందితో కూడిన నూతన కమిటీ ఏర్పాటైంది. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది అధికార ప్రతినిధులు, ఇద్దరు ట్రెజరర్స్, కార్యక్రమ కార్యదర్శితో కమిటీని ఏర్పాటైంది. బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు.

జి.విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బండారు శోభారాణి, సంకినేని వెంకటేశ్వరరావు తదితరులను ఉపాధ్యక్షులుగా నియమించారు.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి ప్రధానకార్యదర్శులుగా నియమితుయ్యారు.

రఘునందన్ రావు, కుంజా సత్యవతి, పల్లె గంగారెడ్డి తదితరులు కార్యదర్శులుగా కొత్త కార్యవర్గంలో కొలువుదీరారు. బండారి శాంతి కుమార్ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నూతన కార్యవర్గంలో సీనియర్ నేతలతో పాటు కొత్తవారికి కూడా అవకాశం కల్పించారు.

Related posts