telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గాంధీ జయంతి రోజున కూడా మద్యం విక్రయాలు: చంద్రబాబు

chandrababu

గ్రామ సచివాలయ వ్యవస్థను ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చినట్టు ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. 2003లోనే గ్రామ సచివాలయాలను ప్రారంభించామని చంద్రబాబు అన్నారు. 11 అవినీతి కేసులున్న వ్యక్తి నీతిమంతుడిలా చలామణి అవుతున్నారని విమర్శించారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేశారని దుయ్యబట్టారు. ఇసుక కొరతతో లక్షలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు.

గాంధీ జయంతి రోజున కూడా మద్యం దుకాణాలను నిర్వహించడమేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులను పెట్టి మద్యాన్ని అమ్మిస్తున్నారని అన్నారు. మహాత్ముడి జయంతి రోజున ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారని అడిగారు. జగన్ వ్యవహారశైలి ఎవరికీ అర్థం కావడం లేదని అన్నారు. బ్రిటీష్ వారు కూడా చట్టాన్ని అనుసరించేవారని చెప్పుకొచ్చారు. జగన్ మాత్రం చట్టాన్ని గౌరవించడం లేదని విమర్శించారు.

Related posts