telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలి: సీఎం జగన్

పౌరసరఫరాలశాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని, సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 1 నుంచి ప్యాక్‌ చేసిన నాణ్యమైన నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు.

నాణ్యమైన బియ్యం, నిల్వలపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. నాణ్యమైన బియ్యం సరఫరాకు 26.63 లక్షల టన్నులు అవసరం కాగా, ఖరీఫ్‌లో, రబీలో పంట ద్వారా 28.74 లక్షల టన్నులు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. వివిధ జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను అధికారులు సీఎంకు చూపించారు.

Related posts