telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దిశ ఘటనపై ప్రజల్లో ఆలోచన వచ్చింది: లోక్ సభలో ఎంపీ బండి సంజయ్

bandi samjay mp

వెటర్నరీ డాక్టర్ దిశ దిశ ఘటనపై ప్రజల్లో ఆలోచన వచ్చిందని లోక్ సభలో తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని అన్నారు. దిశ ఘటనపై లోక్ సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… హైదరాబాద్ లో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా చెడు వాతావరణాన్ని తీసుకొచ్చిందని అన్నారు.

క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్య పర్చడంలో ప్రభుత్వ వ్యవస్థ విఫలమవుతోందన్నారు. వెంటనే శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటి ఘటనలు మరోసారి జరగవని చెప్పారు. ఇలాంటి కేసుల్లో సంవత్సరాల కొద్దీ విచారణలు జరగొద్దన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా దీనిపై ఆలోచించాలని చెప్పారు. దిశ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలన్న విషయంపై చర్చ జరగాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు.

Related posts