telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

రెడ్ జోన్ లో గుంటూరు.. అందరూ జాగ్రత్తగా ఉండాలి: కలెక్టర్

guntur train

గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా 19 పాజిటివ్ కేసులు రావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 306కి పెరిగింది. ఇప్పటివరకు 8 మంది మృతి చెందారు.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. గుంటూరు పట్టణం మొత్తం రెడ్ జోన్ లో ఉందని వెల్లడించారు. రెడ్ జోన్ లో ఉన్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

21 రోజుల పాటు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేకపోతే రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ కు వెళుతుందని వివరించారు. లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని హితవు పలికారు. గుంటూరు జిల్లాలో కరోనా రోగుల చికిత్స కోసం 7 ప్రత్యేక ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న కేసుల్లో ఎవరికీ ఇబ్బందికర పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 28 రోజుల పాటు ఎలాంటి కేసులు లేకపోతే సడలింపులు వస్తాయని చెప్పారు.

Related posts