కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాల సిద్ధంగా ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ రోజు ఆయన హుజురాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. కరోన వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకైతే కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ కాలేదన్నారు. 24 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారని వెల్లడించారు. జలుబు చేసిన వెంటనే ప్రజలు వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ఏ ఎన్నికలు వచ్చినా గెలిచే పార్టీ టీఆర్ఎస్ పార్టీయేనని మంత్రి అన్నారు.