telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నేను తెలంగాణకు గవర్నర్‌గా నేను రావడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి…

kcr governor tamilisai

తెలంగాణ గవర్నర్‌ గా తమిళిసై సౌంద‌ర్ రాజ‌న్ బాధ్యతలు స్వీకరించి ఏడాది అయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో తనకు ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తమిళిసై సౌంద‌ర్ రాజ‌న్.. నేను తెలంగాణకు గవర్నర్‌గా నేను రావడంపై ఎన్నో విమర్శలు వచ్చాయని గుర్తుచేసుకున్నారు. అయితే, వాటిని సమర్థవంతంగా అధిగమించాను అన్నారు గవర్నర్.. ఇక, నాకు సీఎం కేసీఆర్‌తో ఎటువంటి విభేదాలు లేవన్న ఆమె.. తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి సహకారాలు అందిస్తానని వెల్లడించారు. తెలంగాణ గవర్నర్‌గా సంవత్సరం పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు గవర్నర్ తమిళిసై. కాగా, పలు సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు హల్ చల్ చేశాయి. ఘాటైన లేఖలు కూడా రాసారనే ప్రచారం జరిగింది.. గవర్నర్ తమిళిసై మొత్తానికి తన వ్యాఖ్యలతో వాటికి పులిస్టాప్ పెట్టే ప్రయత్నాలు చేశారు. చూడాలి మరి ఇంకా ముందు ముందు ఆవిడ ఏం చేస్తారు అనేది.

Related posts