telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కోడెల భౌతికకాయం ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు

kodela shivaprasad

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బసవతారకం ఆసుపత్రి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికపుడి గాంధీ, టీడీపీ నాయకులు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్, నందమూరి బాలకృష్ణ, దేవినేని ఉమ, నన్నపనేని రాజకుమారి తదితరులు ఆస్పత్రికి చేరుకున్నారు.

బసవతారకం ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. జోహార్ కోడెల అంటూ నినాదాలు చేశారు. పోస్ట్ మార్టమ్ పూర్తయ్యాక కోడెల భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామానికి తరలించనున్నట్టు సమాచారం. కాగా, కోడెల కుమారుడు శివరామ్ విదేశాల్లో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. రేపు ఉదయం హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తోంది.

Related posts