telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

chandrababu met nri in amaravati

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైంది. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత తొలిసారి చంద్రబాబు భాగ్యనగరానికి వచ్చారు. ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. ప్రమాణస్వీకారం చేయడానికి కొద్దిసేపటి ముందు ఆయన లేఖను పంపారు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా జగన్ కు వ్యక్తిగతంగానూ, తెలుగుదేశం పార్టీ తరఫునా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతిపక్షనేతగా తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. ఇక టీడీపీ 23 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Related posts