telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆక్సిజన్ సంక్షోభం : ఏపీకి షాక్ ఇచ్చిన తమిళనాడు సర్కార్..

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. దాంతో కరోనా పేషేంట్లకు వైద్యం ఇచ్చే సమయంలో అవసరమైన ఆక్సిజన్ కొరత భారీగా ఏర్పడుతుంది. ఇప్పటికే రుయా ఆస్పత్రిలో 11 మందికి పైగా కరోనా రొగులు ఆక్సిజన్ అందక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సంక్షోభం అంచున తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఉంది. ఆసుపత్రికి పంపే ఆక్సిజన్ లో కోత విధించాల్సిందిగా సరఫరాదారును ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం. 15 ఏళ్లుగా తమిళనాడులోని ఎయిర్ వాటర్ కంపెనీ నుంచి స్విమ్స్ కి ఆక్సిజన్ వస్తుండగా.. రెండు విడతలుగా రోజుకు 14 కేఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం 8కేఎల్ కి మించి ఆక్సిజన్ పంపించలేమని స్విమ్స్ కి తేల్చి చెప్పారు గుత్తేదారు. ప్రస్తుతం స్విమ్స్ లో 467మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 90 శాతం పడకలకు ఆక్సిజన్ అవసరమని వైద్యులు చెబుతున్నారు. రుయా ఘటన దృష్ట్యా పరిస్థితిని చిత్తూరు జిల్లా కలెక్టర్, స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ దృష్టికి స్విమ్స్ డైరెక్టర్ తీసుకెళ్లారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరపాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ.

Related posts