telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీ ఏయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి అమిత్‌ షా

amith shah bjp

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మంగళవారం ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరారు. ఇటీవల  షా కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. శ్వాసకోస సంబంధ సమస్యతో బాధపడుతూ ఆయన గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో రెండు వారాలుగా చికిత్స పొందుతున్నారు.

ఇటీవలే తనకు నెగెటివ్‌ వచ్చిందని, అమిత్ షా ప్రకటన కూడా చేశారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేవరకు మేదాంత ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.

మెరుగైన వైద్యం కోసం ఆయనను నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలించారు. ఎయిమ్స్‌లోనే ఇకపై ఆయన చికిత్స తీసుకోనున్నారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో ఆయనకు చికిత్స అందుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించారు.

Related posts