దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ట్యాంక్బండ్ దగ్గర ఎన్టీఆర్ ఘాట్లో దగ్గుపాటి పురందేశ్వరి పుష్పగుచ్ఛములుంచి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను, సిద్దాంతాలను కొనసాగించమేఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
ప్రతి తెలుగువాడికి ఎన్టీఆర్ జీవితం ఒక తెరిచిన పుస్తకమని అన్నారు. అందులో ప్రతి పదం, అక్షరం అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గురించి తాను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తారక రామారావు ఒక ప్రబంజనం అన్న విషయం అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని పురందేశ్వరి అన్నారు. ఆయన నినదించినప్పుడు ఆంధ్రరాష్ట్రం ప్రతిధ్వనించిందన్నారు. ఆయనకు బిడ్డగా పుట్టడం జన్మ జన్మల సుకృతంగా భావిస్తున్నానని పురందేశ్వరి అన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ నిర్వహించి తీరుతుంది: లక్ష్మణ్