మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం హైదరాబాద్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీ సమక్షంలో బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి ఓటమి పాలైనప్పటి నుంచి ఆయన కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాజీనామా పత్రాన్ని పంపించారు.
ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఇంద్రకరణ్ రెడ్డి తెలుగుదేశంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు.
ఆ తర్వాత వైఎస్సార్సీపీ, బీఎస్పీ, బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్లో చేరారు. ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశారు.
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యుల ఫోరం మొదటి కన్వీనర్గా పనిచేశారు.