పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల విషయంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ అధ్యయనం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో నిర్వాసితులు పరిహారం కోసం ఆందోళన చేస్తున్నారని ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
నిర్వాసితుల విషయంలో వెంటనే స్పందించిన జగన్.. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా పోలవరం పునరావస సమస్యలపై గ్రీవియెన్స్ సెల్ పెట్టనున్నట్లు తెలిపారు. ఇకపై ఈ సెల్కు నిర్వాసితులు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు.
కేసీఆర్ పై జనసేనాని ఘాటు విమర్శలు..పవన్ పై చంద్రబాబు ప్రశంసలు