తెలంగాణలో మెరిట్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏసీజీఈ అధికారులు తెలిపారు. నవంబర్ 3-2019 తేదీన జరిగే ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్’ టెస్టు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలల 8వ తరగతి చదివే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 29లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. 7వ తరగతిలో జనరల్ విద్యార్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు పొంది ఈ సంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1లక్షా 50వేలు మించకూడదని సూచించారు. జనరల్, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 ఫీజును చెల్లించాలని కోరారు.
next post
రాయలసీమను రెండో రాజధాని చేయాలి.. టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు!