telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రతీ పౌరుడికి మన రాజ్యాంగం రక్షణ కల్పిస్తోంది: గవర్నర్‌

Tamilisai Soundararajan governor

భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ హై కోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహన్‌. మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. దేశంలోని ప్రతీ పౌరుడికి మన రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని అన్నారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను గుర్తు చేసుకుంటూ..నేడు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాజ్యాంగం కల్పిస్తున్న చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. దేశ, రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.

Related posts