విజయవాడ లో హత్యకు గురైన బీఫార్మసీ విద్యార్థి అయేషా మీరా మృతదేహానికి మరికాసేపట్లో రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇప్పటికే తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికకు సీబీఐ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. 2007 డిసెంబర్ 27న అయేషా మీరా హత్య జరిగింది. ఈ కేసులో అప్పట్లో నిందితుడుగా ఉన్న సత్యంబాబును 2008 ఆగస్టు 11న అరెస్టు చేశారు.
విజయవాడ మహిళా సెషన్స్ ప్రత్యేక కోర్టు 2010లో సత్యంబాబుకు 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2017 మార్చి 31న సత్యంబాబును నిర్దోషిగా తేల్చుతూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఎనిమిదేళ్ల జైలు శిక్ష తర్వాత సత్యంబాబు విడుదలయ్యారు. మరోవైపు 2018 నవంబర్ 29న హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. 2019 జనవరిలో సీబీఐ విచారణ ప్రారంభమైంది.
ఇంకా చాలా విషయాలు బయటకు రాలేదు… మీటూపై హీరోయిన్ అసంతృప్తి