telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ నిర్వహించి తీరుతుంది: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ నిర్వహించి తీరుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు.ఆదివారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవం జరపటానికి వచ్చే ఇబ్బందులేంటో సీఎం కేసీఆర్ ప్రజలకు చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. విమోచన దినోతవ్సం జరిపితే సంక్షిష్టమవుతుందన్న కేసీఆర్ వివరణ ఇవ్వాలని అన్నారు.

విమోచన దినోత్సవం జరిపితే ప్రభుత్వానికి ఏమైనా ముప్పు ఏర్పడుతుందా? అని ప్రశ్నించారు. గతంలో విమోచన దినోతవ్సంపై ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు ఇప్పుడు మాట్లాడాలని అన్నారు. ప్రభుత్వం నిర్వహించకపోయినా బీజేపీ నిర్వహించి తీరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. పటాన్ చెరులోని ఎస్వీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో బీజేపీ సభ ఏర్పాటు చేస్తామన్నారు.

Related posts