telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

భారత్ బయోటెక్ నుంచే తొలి వ్యాక్సిన్: కేటీఆర్

KTR TRS Telangana

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోసం పలు దేశాలు ప్రయోగాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ భారత్ బయోటెక్ నుంచే తొలి టీకా వస్తుందని తెలిపారు. హైదరాబాదులోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ ను ఈరోజు ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకాల తయారీలో భారతదేశ భాగస్వామ్యం అత్యంత కీలకమైనదని ప్రపంచ దేశాలు చెపుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రాముఖ్యత పెరిగిందని చెప్పారు. ప్రపంచ దేశాలకు మూడో వంతు వ్యాక్సిన్ ను హైదరాబాద్ నుంచి అందిస్తున్నామని తెలిపారు. అందరి కృషి వల్లే ఇది సాధ్యమయిందని చెప్పారు.

Related posts