కేంద్రం తాజాగా ప్రకటించిన లాక్డౌన్ సడలింపులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కరోన ఇంకా అదుపులోకి రాకముందే సడలింపులు ఇవ్వడం సరైన నిర్ణయం కాదన్నారు. ఢిల్లీ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ తాజా మార్గనిర్దేశకాలను ఢిల్లీలో అమలు చేయబోమని స్పష్టం చేశారు.ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనలే అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగిస్తామని తెలిపారు.
ఢిల్లీలో దుకాణాలను తెరచే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 27న ప్రధానమంత్రితో జరిగే వీడియో సమావేశం తర్వాత ఆంక్షల సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ చెప్పారు. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే ఆంక్షలపై సడలింపులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 2,514 మందికి వైరస్ వ్యాపించింది.
కరోనా వ్యాక్సిన్ పై మోడీ కీలక వ్యాఖ్యలు…