కరోనా పోరులో భారత్కు ఆస్ట్రేలియా క్రికెట్ అండగా నిలుస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్, యునిసెఫ్ ఆస్ట్రేలియా భాగస్వామ్యంతో అవసరమైన నిధులను సేకరించేందుకు సిద్దమైంది. కరోనా సెకండ్ వేవ్ భారత్కు చేస్తున్న నష్టాన్ని చూసి క్రికెట్ ఆస్ట్రేలియా చలించిపోతుంది. ఈ విపత్కపరిస్థితుల్లో భారత్తో బలమైన స్నేహాన్ని పంచుకోవడానికి ఆస్ట్రేలియన్లు సిద్దంగా ఉన్నారు. యూనిసెఫ్ ఆస్ట్రేలియా సాయంతో ఈ నిధులను ఖర్చు చేయనుంది. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల స్థాపనకు, కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కావాల్సిన పరీక్షా సామాగ్రిని, కోవాక్స్ ప్రోత్సాహంతో వ్యాక్సిన్ పంపిణీకి చేయడానికి ఖర్చు చేయనుంది. ఈ నిధుల సేకరణ కార్యక్రమంలో ముందుగా క్రికెట్ ఆస్ట్రేలియా తమ వంతు సాయంగా 50వేల డాలర్లను విరాళం అందజేస్తుంది. ఆస్ట్రేలియా ప్రజలందరూ తోచిన సాయం చేయాలని కోరుతోంది’అని ఆ ప్రకటనలో పేర్కొంది. అందరి కన్నా ముందుగా ఆస్ట్రేలియా పేసర్, కేకేఆర్ ఆల్రౌండర్ ప్యాట్ కమిన్స్ 50వేల డాలర్లు విరాళం అందించి అందరికి ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే.
previous post
next post