మహారాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలడం బీజేపీకి చెంపపెట్టులాంటిదని అన్నారు. మహా రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు.
తమకు మెజారిటీ లేదని తెలిసినప్పటికీ బీజేపీ నేత ఫడ్నవీస్.. ముఖ్యమంత్రిగా ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని అవమాన పరిచారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం కూడా ఉందని విమర్శించారు.