telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

రొమాంటిక్ చిత్రంలో .. పాట రాసిన పూరీ .. హిట్ కోసం తపనా …

Romantic

దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా రూపొందుతున్న చిత్రం “రొమాంటిక్”. ఈ సినిమా పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరిజగన్నాథ్ స్వయంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆకాష్ బాల నటుడి గా ఎన్నో చిత్రాల్లో కనిపించాడు. ఆ తర్వాత సోలో హీరోగా “ఆంధ్రాపోరీ సినిమా చేసినప్పటికీ అది సక్సెస్ అవలేదు. ఆ తర్వాత డైరెక్టుగా పురి జగన్నాథ్ దర్శకతంలో మెహబూబా అనే సినిమా చేసినా దాని ఫలితం నిరాశ కలిగించింది. మెహబూబా తర్వాత మళ్ళి రొమాంటిక్ అంటూ మన ముందుకు రాబోతున్నాడు ఆకాష్..కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించింది మాత్రం పూరి జగన్నాథే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు రిలీజ్ చేసింది చిత్ర బృందం. సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా ప్రమోషన్ల మీద దృష్టి పెట్టారు.

తాజాగా ఈ సినిమా నుండి నువ్వు నేను ఈ క్షణం అనే పాటను రిలీజ్ చేశారు. అయితే ఈ పాటని రాసింది పూరి జగన్నాథే కావడం విశేషం. తన సినిమాలకి కథ, కథనంతో పాటు మాటలు రాసే పూరి జగన్నాథ్ తన కొడుకు కోసం పాటల రచయితగా మారిపోయాడు. గతంలో బిజినెస్ మేన్ సినిమాలో పాటకోసం తన గొంతు కలిపిన సంగతి తెలిసిందే. అంతే కాదు అప్పుడప్పుదు తన సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు. ఏ మాయ చేశావే సినిమాలో దర్శకుడి పాత్రలో కనిపించాడు. అలాగే తన సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసాడు. ఇప్పుడు కలం పట్టుకుని పాట రాయడం, అది కూడా తన కొడుకు సినిమా కోసం చేయడం చూస్తుంటే, ఆకాష్ కి హిట్ ఇవ్వాలని పూరి ఎంత తపిస్తున్నాడో అర్థం అవుతుంది.

Related posts