శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీ కోసం కోల్కతాలో బీజేపీకి అనుమతి lలభించలేదు. సిటీలో ఎవరూ రాజకీయ ర్యాలీలు నిర్వహించరాదు అని పోలీసులు ఆదేశించారు. ర్యాలీలు తీసేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ నిలిపేశారు. బైక్ ర్యాలీలను ఎవరూ అడ్డుకోరాదు అని ఆ రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ ఘోష్ తెలిపారు.
ప్రభుత్వం తమ ర్యాలీలను అడ్డుకుంటే, ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. బీజేపీ చేపట్టిన బైక్ ర్యాలీలపై తృణమూల్ నేత అనుబ్రత మోండల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ర్యాలీలు అనాగరిక ప్రజలు చేస్తారని విమర్శించారు. పురిలియా, గర్బెటా ప్రాంతాల్లో ఇవాళ ర్యాలీ చేపట్టారు.
వైసీపీ ప్రభుత్వం దేనికైనా తెగిస్తుంది: జేసీ దివాకర్ రెడ్డి