తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. అక్కినేని నాగేశ్వరరావు, సుమన్, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోల సినిమాలకు ఎడిటర్గా పని చేసిన మురళి( 64) డిసెంబర్ 21 ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. మురళీ తెలుగులోనే కాక హిందీలోను అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోల సినిమాలకి పని చేశారు.
ఐదు భాషలలో దాదాపు 300 సినిమాలకి పని చేసిన ఆయన అనేక అవార్డులు కూడా అందుకున్నారు. మురళి అంత్యక్రియలు డిసెంబర్ 22న జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో జరపనున్నట్లు తెలిపారు కుటుంబ సభ్యులు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని పలువరు ప్రముఖులు ప్రార్ధించారు.
కనీసం అద్దె ఇల్లు కూడా దొరకలేదు : తాప్సి