telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేషన్ కార్డ్ లబ్దిదారులకు రెండ్రోజుల్లో నగదు

Ration card telangana

లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పేద కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రూ.1,500 నగదు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు రూ. 1,314 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని 74 శాతం పూర్తిచేసినట్లు తెలిపారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి బుధవారం నాటికి రాష్ట్రంలో 2 కోట్ల మంది లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున రేషన్‌ పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు.తెలిపారు.

Related posts