దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తుండడంతో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ర్టాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ లో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించారు. రాజధాని లక్నోకు లక్షకు పైగా మాస్కులను పంపించారు.
వాటిని కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం పంపిణీ చేస్తారని ఉత్తరప్రదేశ్ మీడియా కోఆర్డినేటర్ లలన్ కుమార్ చెప్పారు. ప్రియాంకా గాంధీ ఇతర జిల్లాలకు ఇప్పటికే మందులను పంపించారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రాష్ట్రంలోని 47 లక్షలకు పైగా జనాభాకు రేషన్, ఆహార పదార్థాలను అందిచామని చెప్పారు.