ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి విమర్శలు గుప్పించారు. బుధవారం గుంటూర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ పాలన ఉందని విమర్శించారు. ఎన్నో సార్లు హెచ్చరించినప్పటికీ జగన్ తీరు మారడం లేదన్నారు. జగన్ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో హిందూ ధర్మం కోసం సాధు సమితి కృషి చేస్తుందన్నారు. తిరుమల దేవస్థానంలో అన్యమతస్థల ఉద్యోగులను తోలింగించాలని డిమాండ్ చేశారు. హిందుత్వ వ్యతిరేక చర్యలను ప్రశ్నించివందికే ఎల్వీని అడ్డుతొలగించారని ఆరోపించారు. అవమానకర రీతిలో ఎల్వీ సుబ్రమణ్యంను తొలగించారన్నారు. ఏపీలో హిందువులను ఏకం చేస్తామని, హిందూ ధర్మాన్ని కాపాడే వారికే ఓట్లు వేసే విధంగా చూస్తామన్నారు. గుంటూరులో తొలింగించిన అమ్మవారి ఆలయాన్ని తిరిగి నిర్మాంచాలని డిమాండ్ చేశారు.