గత కొన్ని సీజన్లుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆటగాళ్లు, కోచ్లు మార్చినా ఫలితం దక్కలేదు. ఆరంభంలో అదరగొట్టడం చివరలో చేతులెత్తేయడం ఆ జట్టుకు అలవాటైపోయింది. ఈ నేపథ్యంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ సీజన్ 2021 కు ముందు కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీ తన పేరు “పంజాబ్ కింగ్స్” గా మార్చుకుంది. ఈ విషయాన్ని పంజాబ్ జట్టు యాజమాన్యం బీసీసీఐకి వెల్లడించింది. ఇందుకు బోర్డు కూడా అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అయితే.. యాజమాన్యం కానీ , ఫ్రాంచైజీ అధికారులు కానీ పేరు మార్పు వెనక ఉన్న కారణాల గురించి మాత్రం చెప్పలేదు. అయితే.. పేరు మార్పును మాత్రం ఓ స్పోర్ట్స్ వెబ్ సైట్ కు ఫ్రాంచైజీ అధికారులు ధ్రువీకరించారు. మరో 2 రోజుల్లో ఘనంగా రీ-లాంచ్ కార్యక్రమం నిర్వహించాలని కింగ్స్ ఎలెవన్ యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 18న జరుగనున్న వేలంలో పంజాబ్ కింగ్స్ పేరుతోనే పాల్గొననున్నట్లు చెబుతున్నారు. జట్టు పేరు మార్పుతోనైనా.. ఈ సారి టైటిల్ కొట్టాలని పంజాబ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
previous post
next post
పీపీఏలపై హైకోర్టు తీర్పు జగన్ సర్కారు కు చెంప పెట్టు: కళా వెంకట్రావ్