telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాజకీయ లబ్ధి కోసం ఇంతగా బరితెగించాలా -చంద్రబాబు పై పేర్నినాని ఫైర్‌

రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నిత్యం అసత్యం ప్రచారం చేయడమే చంద్రబాబు పని అని దుయ్యబట్టారు.

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారంపై పేర్నినాని స్పందించారు.చంద్రబాబు రాజకీయంగా ఎంతకైనా దిగజారతారని ప్రశ్నించారు. ఫేక్ వీడియోలను స్పష్టించి దుష్ప్రచారం చేస్తున్నారు. అశ్లీలాన్ని కూడా తన రాజకీయం కోసం వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.

ఇంత దిగజారాల్సిన అవసరం ఏమైనా ఉందా..?. చంద్రబాబుకు దేవుడు అసలు సిగ్గు పెట్టినట్లు లేదు. వ్యవస్థలను తన అవసరాలకు వాడుకునే వ్యక్తి చంద్రబాబు.. తన ఎల్లో మీడియాతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.

అమెరికా సంస్థల్ని కూడా దిగజారుడు రాజకీయాల్లోకి లాగుతున్నారని.. అమెరికా సంస్థ ఇచ్చిందంటూ ఓ ఫేక్ రిపోర్టును ప్రచారం చేశారని పేర్నినాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఫేక్ వీడియోను సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. నిత్యం అసత్య ప్రచారం చేయడమే చంద్రబాబు పని అని.. తనకు అనుకూలమైన వారితో కలిసి చంద్రబాబు కుట్రలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు.

సీఎం జగన్‌ రాజకీయాల్లో ఆదర్శంగా ఉంటున్నారు. చంద్రబాబు రాజకీయంగా ఎంతకైనా దిగజారతారు. గోరంట్ల మాధవ్‌పై ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారు?. పోతిన ప్రసాద్‌ ఎవరో టీడీపీ నేతలు చెప్పాల‌ని అన్నారు.

Related posts