కరోనాను అరికట్టేందుకు పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ రూ.5 కోట్ల విరాళం ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ తన ధన్యవాదాలు తెలిపారు.
‘రిలయన్స్’ జియో తెలంగాణ సీఈఓ కేసీ రెడ్డి ఇందుకు సంబంధించిన విరాళం చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేయాలని కోరుతూ కేటీఆర్ కు అందజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేటీఆర్ ఓ పోస్ట్ చేశారు. ‘కరోనా’ మహమ్మారి వ్యాప్తి చెందకుండా తాము చేస్తున్న పోరాటానికి ఈ మొత్తం ఎంతో ఉపయోగపడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.