telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

చంద్రబాబు పై ఆరోపణలు గుప్పించిన సజ్జల…

sajjala

మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన… అసైన్డ్ భూముల వ్యవహరంలో చంద్రబాబు దళితులకు అన్యాయం చేశారని విమర్శించారు.. టీడీపీ హయాంలో చంద్రబాబు బినామీలు కారు చౌకగా భూములు కొట్టేశారన్న ఆయన.. భూములు దోచుకునేందుకే రాజధాని పేరుతో చంద్రబాబు అతి పెద్ద స్కామ్‌కు పాల్పడ్డారని.. అసైన్డ్ భూములపై జీవో 41 జారీ చేస్తే ఇబ్బందులు వస్తాయని అప్పట్లోనే లా సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, సీఆర్డీఏ కమిషనర్ హెచ్చరించినా.. చంద్రబాబు పట్టించుకోలేదని.. ప్రలోభపెట్టి.. బెదిరించి ప్రభుత్వం కేసులు పెట్టించిందని ఇప్పుడు టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఇక, అసైన్డ్ భూములే కాదు.. లంక భూముల కుంభకోణం మరోకటుంది… నాడు భయపెట్టి.. బెదిరించి భూములను లాక్కొన్నారని ఆరోపించారు.. పేదలకు ఇళ్ల కోసం అసైన్డ్ భూములని తీసుకుంటే దానితో పోలిక పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. మేం ఇచ్చిన జీవోకు.. టీడీపీ ఇచ్చిన జీవోకు పోలికే లేదేని స్పష్టం చేశారు.

Related posts