telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పక్క రాష్ట్రాల్లో పేరున్న మద్యం బ్రాండ్లు: రఘురామకృష్ణరాజు

ycp Raghurama krisharaju

ఏపీలో విక్రయించే మద్యం బ్రాండ్లపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో విచిత్రమైన బ్రాండ్లు అమ్ముతున్నారని అన్నారు. ఏపీలో అమ్మే ఆ మద్యం బ్రాండ్లకు పేర్లు ఎలా పెడతారో, వాటి నాణ్యత ఏమిటో అర్థంకావడంలేదని తెలిపారు. పేరున్న బ్రాండ్లన్నీ పక్కరాష్ట్రాల్లో అమ్ముతున్నారని తెలిపారు.

రాష్ట్రంలో మాత్రం గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, నోబెల్ ప్రైజ్, భారతరత్న వంటి బ్రాండ్లు అమ్ముతున్నారని అన్నాడు. పక్కరాష్ట్రాల్లో దొరుకుతున్న మద్యం రోజుకు ఓ క్వార్టర్ తాగితే 20 ఏళ్లలో లివర్ చెడిపోతుంది అనుకుంటే, మన రాష్ట్రంలో దొరికే మద్యం ఒక క్వార్టర్ తాగితే రెండు, మూడేళ్లలోనే హరీ మంటారని చాలామంది అంటున్నారని తెలిపారు. మద్య నిషేధం అంటున్నారు కాబట్టి పూర్తిగా అమలు చేస్తే మంచిదని ప్రభుత్ర్వానికి రఘురామ హితవు పలికారు.

Related posts