telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

దివంగత ఎమ్మెల్యే నోములకు ఘన నివాళి

అనారోగ్యంతో ఇటీవల మరణించిన నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యాకు పలువురు నేతలు ఘన నివాళులు అర్పించారు. జిల్లాలోని హాలియాలో నోముల సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు నర్సింహయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి, మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, మండలి చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కరరావు, కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర నాయక్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, యాదాద్రి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నేతలు రాములునాయక్, వేముల వీరేశం, నోముల కుటుంబ సభ్యులు లక్ష్మి, భగత్, తదితరులు హాజరయ్యారు.

Related posts