ఐదేళ్ల పాటు ఇసుకను దోచుకున్న టీడీపీ నేతలే ఇప్పుడు ధర్నా చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఏపీ మంత్రి తానేటి వనిత విమర్శించారు. ఇసుక కొరతపై టీడీపీ నేతలు ధర్నా చేయడం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ఇసుక పాలసీ వస్తుందని టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల ఇసుక దోపిడీని భరించలేకే ఆ పార్టీని ప్రజలు ఓడించారని వ్యాఖ్యానించారు.
ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా అధికారి వనజాక్షిపై టీడీపీ నేత చింతమనేని నాడు దాడి చేశారని, అలాంటి వ్యక్తి ఈరోజు ఇసుక కొరతపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా ఇసుక తవ్వకం సాధ్యం కాలేదని, సెప్టెంబర్ 5 నుంచి పారదర్శకంగా ఇసుకను సరఫరా చేస్తామని మంత్రి చెప్పారు.
భారత్పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ముషారఫ్