telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ప్రముఖ క్రీడాకారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

modi speech on J & K

క‌రోనా మ‌హమ్మారిని తుద‌ముట్టించేందుకు జరుగుతున్న పోరాటం గురించి ప్రముఖ క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్​, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్​ సహా మొత్తం 49మంది క్రీడాకారులు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని క్రీడాకారులను మోదీ కోరారు. అభిప్రాయాలను అడిగి తెలుసున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రధాని మోదీ ఐదు సూత్రాలను ఉపదేశించారు. కరోనాపై యుద్ధంలో ‘సంకల్స్​(సంకల్పం), సన్యం(సమన్వయం), సంక్రమత(సానుకూలత), సమ్మాన్​(ఐకమత్యం), సహయోగ్​(సహాయం).. అనే సూత్రాలను పాటించాలని, దేశ ప్రజల్లో ధైర్యాన్ని, సానుకూలతను నింపాలని క్రీడాకారులకు సూచించారు.

Related posts