రంజాన్ను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ హాజరయ్యారు. వీరితో పాటు తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్రావు, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తదితరులు విందుకు హాజరయ్యారు. ఇఫ్తార్ విందు సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇరు రాష్ట్రాల ప్రముఖులు విందుకు హాజరవడంతో రాజ్భవన్లోని సంస్కృతి మందిరం సందడిగా మారింది. ఈసందర్భంగా గవర్నర్ నరసింహన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.


జగన్ కేబినెట్ లో సామాజికవర్గాలకు ప్రాధాన్యత: కృష్ణం రాజు