telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రీడలు రాజకీయ వార్తలు

కియా పరిశ్రమ ద్వారా 18 వేల మందికి ఉపాధి: జగన్

jagan

కియా పరిశ్రమ ద్వారా 18 వేల మందికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమని ఏపీ సీఎం జగన్ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీకి జగన్ ముఖ్య అతిథిగా హాజరై ఆ సంస్థ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఆ సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఇక్కడ కియా ఫ్యాక్టరీని ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు.

కియా సంస్థ కార్ల పరిశ్రమ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఏర్పాటు కావటం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసినందుకు ఆ సంస్థను అభినందిస్తున్నానని చెప్పారు. కియా బాటలోనే మరిన్ని సంస్థలు ఏపీకి వస్తాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

Related posts