telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఏపీలో 534 పాజిటివ్ కేసులు.. గుంటూరులో అత్యధికం!

karona chekup hospital

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 534 కి పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 వరకు జరిపిన కొవిడ్19 పరీక్షల్లో మరో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది. కృష్ణా జిల్లాలో 3, కర్నూలులో 3, పశ్చిమ గోదావరిలో 3 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.

కొత్తగా నమోదైన 9 కేసులతో కలిపి మొత్తం 534 పాజిటివ్ కేసుల్లో ఇప్పటివరకు 20 మంది డిశ్చార్జ్ అయ్యారని, 14 మంది మరణించారని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 500 అని చెప్పింది. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరులో 122 కేసులు నమోదుకాగా ఆ తర్వాత కర్నూలులో 113 కరోనా పాటిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Related posts