హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేడు తెరాస కు రాజీనామా చేశారు. తెరాస కి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు… అయితే ఉరిశిక్షపడిన ఖైదీకి కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, కానీ, ఏం జరిగిందో తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారని, రాత్రికి రాత్రే విచారణ చేసి బర్త్రఫ్ చేశారని ఈటల ఆరోపించారు. 19 ఏళ్లుగా టీఆర్ఎస్లో ఉన్నానని, ఓ అనామకుడు లేఖరాస్తే రాత్రికి రాత్రే మంత్రిమీద విచారణ చేస్తారా అని ప్రశ్నించారు. తనపై జరుగుతున్న దాడి, కుట్రలపై ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఈటల పేర్కొన్నారు. హుజూరాబాద్లో ఏ ఎన్నికలు జరిగినా పార్టీని గెలిపించుకున్నామని, డబ్బులు, కుట్రలతో అధికార పార్టీ గెలవొచ్చని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ను కలిసేందుకు రెండుసార్లు ప్రయత్నించనని, కానీ, అవకాశం ఇవ్వలేదని ఈటల పేర్కొన్నారు.
previous post
ఉద్యోగం కావాలంటే పరాయి రాష్ట్రానికి వెళ్లాల్సిందేనా?: చంద్రబాబు