telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ధూళిపాళ్లను కలిసిన నారా లోకేష్…

టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను,వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు నారా లోకేష్. అనంతరం… ఓ అమూల్ బేబీ.ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. పాడి రైతులకు రూ.4 ఎక్కువ ఇవ్వటం, ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందించటం తప్పా అని అన్నారు. దశాబ్దాల నుంచి రైతు ప్రయోజనాల కోసం పని చేస్తున్న సంగం డెయిరీ పై కక్ష సాధింపు దుర్మార్గం.అమూల్ డెయిరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 వేల కోట్లు ప్రజాధనం వృధా చేస్తుంది.అసలు,వడ్డీ కలిపి ఏడాదికి 500 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. ప్రజలు చనిపోతుంటే పట్టించుకోని దద్దమ్మ జగన్ రెడ్డి కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇచ్చారు.జగన్ రెడ్డి ఓ శాడిస్టు రెడ్డి.ప్రజల పక్షాన పోరాడే సొంత ఎంపీని కొట్టించిన శాడిస్టు.లక్ష కోట్లు దోపిడీ చేసి జైలుకెళ్లిన జగన్ రెడ్డి కక్షతో తెలుగుదేశం నేతల్ని జైలుకు పంపుతున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే ఏ ఒక్కరి అధికారినీ వదిలిపెట్టం.ఇప్పటికైనా కక్షసాధింపు పక్కన పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి అని పేర్కొన్నారు.

Related posts