telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

స్కూటీని ఢీకొట్టిన లారీ..అక్కాతమ్ముడు మృతి

Accident

స్కూటీని లారీ ఢీకొట్టడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్‌కు చెందిన పూజ(19), ఆమె తమ్ముడు సాయితేజ(17) స్కూటీపై రామచంద్రాపురం వెళ్తుండగా.. సంగీత థియేటర్‌ సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న అక్కాతమ్ముడు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts