స్కూటీని లారీ ఢీకొట్టడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా, అమీన్పూర్కు చెందిన పూజ(19), ఆమె తమ్ముడు సాయితేజ(17) స్కూటీపై రామచంద్రాపురం వెళ్తుండగా.. సంగీత థియేటర్ సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న అక్కాతమ్ముడు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.