telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

చెన్నైకి భారీ షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న ముగ్గురు ఆసీస్ ఆటగాళ్ళు

2021 ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. అయితే ఇలాంటి సమయంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్ పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ ఈసారి లీగ్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా క్రికెట్‌.కామ్‌.ఏయూతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించాడు. లాక్‌ డైన్‌ త్వరాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ ప్రారంభమైన నాటి నుంచి దీర్ఘకాలంగా వివిధ పరిస్థితుల్లో బయోబబుల్‌, క్వారంటైన్‌ళో ఉన్న అతడు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ సారి జరిగే ఐపీఎల్‌ లో ఆడకుండా ఆ సమయంలో కుటుంబ సభ్యులతో గడపాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అయితే.. ఈ విషయంపై చెన్నై జట్టు నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే మెగా ఈవెంట్‌లో పాల్గొనకుండా తప్పుకున్న మూడో ఆసీస్‌ క్రికెటర్‌గా హేజిల్‌వుడ్‌ నిలిచాడు. కాగా..ఆర్సీబీలో జోష్‌ ఫిలిప్‌, సన్‌రైజర్స్‌లో మిచెల్‌ మార్ష్‌ తప్పుకున్న విషయం తెలిసిందే.

Related posts