ప్రజా సంక్షేమం మరిచిన ఏపీ ప్రభుత్వం రౌడీయిజంతో పాలన సాగిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. అయినప్పటికీ తాము ప్రజల కోసం చేస్తోన్న పోరాటంలో వెనక్కి తగ్గబోమన్నారు. టీడీపీ నేత నారా లోకేశ్కు భద్రత తగ్గించి వైసీపీ నేతలను ఆ పార్టీ అధిష్ఠానం దాడులకు ప్రోత్సహిస్తోందని కళా వెంకట్రావు ఆరోపించారు.
తూర్పుగోదావరి జిల్లాలో నారా లోకేశ్ పర్యటించిన నేపథ్యంలో ఆయనపై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించారని ఆయన చెప్పారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఏపీలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేకే వైసీపీ నేతలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. దాడికి ప్రయత్నించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.